మెట్రో కొత్త రికార్డ్ : ఒక్కరోజే 3లక్షల 80 వేల మంది ప్రయాణం

మెట్రో కొత్త రికార్డ్ : ఒక్కరోజే 3లక్షల 80 వేల మంది ప్రయాణం

ఆర్టీసీ సమ్మెతో మెట్రో రైల్ కు పబ్లిక్ పోటెత్తుతున్నారు. దసరా సెలవుల తరువాత సోమవారం దాదాపు 3లక్షల 80 వేల మందితో మెట్రో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని సంస్థ ఎండీ NVS రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 810 ట్రిప్పులు నడుపుతున్నట్టు చెప్పారు. రష్ పెరుగుతుండటంతో… ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్ నడుపుతున్నామన్నారు. ఎల్బీనగర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్ మెట్రో స్టేషన్స్ పబ్లిక్ తో కిటకిటలాడుతున్నాయి.