నాగోల్‌లో మిస్ అయిన బాలుడు మృతి

నాగోల్‌లో మిస్ అయిన బాలుడు మృతి

హైదరాబాద్ నాగోల్‌లో నిన్న(అక్టోబర్ 29) మిస్ అయిన బాలుడు మనీష్(12) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న బ్లైండ్స్ కాలనీలో నివాసం ఉంటే బాలుడు మనీష్ గా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బాలుడు బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అయితే నిన్న రాత్రి అయినా మనీష్ తిరిగి ఇంటికి రాకపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికంగా ఉన్న జైపూర్ కాలనీ నీటికుంటలో మనీష్ ని గుర్తించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.