అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంపై గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం బాటసింగారం మార్కెట్ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. – వెలుగు, అబ్దుల్లాపూర్మెట్
