- ఎన్ఎస్డీసీ, టీజీసీహెచ్ఈ భేటీలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ లెవెల్లో కొలువులు సాధించేందుకు వీలుగా హైదరాబాద్ వేదికగా విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో మార్చి మొదటి వారం నుంచి ఇంగ్లిష్, జర్మన్, జపనీస్ భాషల్లో కోర్సులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వీ.బాలకిష్టారెడ్డి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) మేనేజర్ ప్రశాంత్ భేటీ అయ్యారు.
పీఎంకేవీవై 4.0, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కూడా భేటీలో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హైదరాబాద్లోని కన్హా శాంతి వనంలో ఈ నెల 21 నుంచి 24 వరకూ 'సౌత్ రీజినల్ స్కిల్స్ కాంపిటీషన్' జరగనుందని చెప్పారు.
దీంట్లో 42 రకాల స్కిల్స్ను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎన్ఎస్డీసీ స్వల్పకాలిక కోర్సుల్లో చేరొచ్చని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫ్యూచరిస్టిక్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకు ఎన్ఎస్డీసీ, ఉన్నత విద్యామండలి కలిసి పనిచేస్తాయని చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.
