నిఘా నీడలో చార్మినార్​ పరిసరాలు.. 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్​

నిఘా నీడలో చార్మినార్​ పరిసరాలు.. 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్​

హెరిటేజ్​వాక్ ​సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్​ కల్పించారు. మూడు రోజులు ముందుగానే చార్మినార్‌‌, చౌమహల్లా ప్యాలెస్‌ సహా పాతబస్తీలోని పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీపీ సీవీ ఆనంద్, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మెహ్రా బందోబస్త్​ను పర్యవేక్షించారు. మిస్​వరల్డ్ ​కంటెస్టెంట్లు పర్యటించే ప్రాంతాలను సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వాటిని ముగ్గురు అడిషనల్‌ డీసీపీల ఆధ్వర్యంలో మానిటరింగ్‌ చేశారు.

లా అండ్ ఆర్డర్‌‌, టాస్క్​ఫోర్స్‌ సహా రెండు బృందాల ఆక్టోపస్‌ బలగాలు, క్విక్ రియాక్షన్‌ టీమ్స్‌ సోమవారం రాత్రి నుంచే పాతబస్తీలో నిఘా పెట్టాయి. ముందస్తుగా డాగ్ స్క్వాడ్‌, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను బైండోవర్‌ ‌చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. మదీనా, చార్మినార్, శాలిబండ, ఓల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ ​చేశారు.