బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ నుంచి మరో యువ క్రికెటర్ మహ్మద్ మాలిక్ అండర్-19 ఇండియా ఏ టీమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్గా నాంపల్లిలోని మల్లెపల్లికి చెందిన ఫాస్ట్ బౌలర్ మాలిక్ నిలవడంతో.. అతనికి బీసీసీఐ ఈ అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా అతని తండ్రి మహ్మద్ అబ్దుల్ సుబాన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
మహ్మద్ సిరాజ్ స్ఫూర్తితో ప్రాక్టీస్ చేసి మాలిక్ అండర్ 19 టీమ్కు సెలక్ట్ అయినట్లు తెలిపారు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా జరిగిగే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో మాలిక్ పాల్గొంటారన్నారు. 35 ఏండ్లుగా క్రికెట్ ఆడుతూ భారత్ టీమ్కు ఆడాలనే తన డ్రీమ్ను కొడుకు నెరవేరుస్తున్నాడని గర్వంగా చెప్పారు. భవిష్యత్లో ఇండియన్ టీమ్కూ ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
