
- వెంగళరావు పార్కు లో తొలిసారిగా
- స్ట్రీట్డాగ్స్ అడాప్షన్ ప్రోగ్రామ్
- 39 కుక్కపిల్లల్లో 24 డాగ్స్ ను
- దత్తత తీసుకున్న డాగ్ లవర్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు : స్ట్రీట్ డాగ్స్ దత్తత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఆదివారం ప్రారంభించింది. ‘బీ ఏ హీరో అడాప్ట్.. డోంట్ షాప్’ అనే నినాదంతో బంజారాహిల్స్ లోని జలగం వెంగళరావు పార్కు లో తొలిసారిగా ఇండీ పప్పీ దత్తత మేళాను స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కమిషనర్ఆర్వీ కర్ణన్ప్రారంభించారు. ఎన్జీవో లు, డాగ్ లవర్స్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు తీసుకువచ్చిన 39 కుక్క పిల్లలను ఈ ప్రదర్శనలో ఉంచగా, 24 కుక్కపిల్లలను దత్తత తీసుకున్నారు. కమిషనర్ కర్ణన్మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్నారు.
2 నెలల పిల్లలే దత్తతకు ..
2 నెలల వరకు పిల్లలు తల్లిపాలు తాగుతాయి కాబట్టి ఆ తర్వాతే వాటిని చేరదీసి దత్తతకు ఇస్తున్నామని బల్దియా వెటర్నరీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి15 రోజులకోసారి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుక్కకాట్లతో పాటు వాటి జనాభాను తగ్గించేందుకు ఈ ప్రోగ్రామ్దోహదపడుతుందన్నారు. వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం లభించక దాడులు చేస్తున్నాయని, దత్తత ఇవ్వడంతో ఆ సమస్యకు చెక్ పడుతుందన్నారు.
దత్తతకు తీసుకునే వారి వివరాలను తీసుకుని, రెగ్యులర్గా ఫాలో అప్చేస్తామని చెప్పారు. ఆరు నెలల తర్వాత స్టెరిలైజేషన్ కూడా చేస్తామన్నారు. కుక్కపిల్లలను అందజేసే ముందు డీ–వార్మ్ చేసి వ్యాక్సిన్ వేసి అందజేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, అధికారులు పాల్గొన్నారు.