
మాదాపూర్, వెలుగు: ఈ నెల 25న దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడిని కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బందిని సోమవారం హైడ్రా చీఫ్ఏవీ రంగనాథ్ అభినందించారు. శుక్రవారం రామిరెడ్డి అనే యువకుడు మద్యం మత్తులో భార్యతో గొడవ పడి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి అంచున నిలబడి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
ఇది చూసిన అక్కడి డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుపతి యాదవ్, సంతోష్ చారి, మహ్మద్ఇమ్రాన్ అతడిని పట్టుకున్నారు. వీరిని కమిషనర్ సోమవారం అభినందించి సత్కరించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్వర్ల పాపయ్య, ఆర్ఎప్ వో జయప్రకాశ్, ఎస్ ఎఫ్వో సతీశ్, హైడ్రా ఇన్స్పెక్టర్ రవి ఉన్నారు.