హైదరాబాద్, వెలుగు: ‘ఇంటెలిజెన్స్ ఎవ్రీవేర్’ థీమ్తో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీఏ) 33వ యాన్యువల్ సమిట్ను మార్చి 5నహెచ్ఐసీసీలో నిర్వహించనుంది. హైదరాబాద్ ఎస్టీపీఐ, తెలంగాణ ఐటీ శాఖ భాగస్వామ్యంతో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతారు.
ఐటీ రంగంలో ఎగుమతులు, ఉపాధి కల్పనలో సత్తా చాటిన సంస్థలకు అవార్డులు అందజేస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో వస్తున్న మార్పులపై, ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చిస్తారు. బిజినెస్ లీడర్లు తమ అనుభవాలను పంచుకుంటారు.
