
అక్కినేని నాగార్జున, ధనుష్ మల్టీస్టారర్ గా, రశ్మిక మంధన హీరోయిన్ గా వస్తున్న ‘కుబేర’ మూవీపై సౌత్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల రిలీజైన టీజర్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తు్న్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జునపై హీరో ధనుష్ ప్రశంసల వర్షం కురిపించాడు.
నాగార్జున ఒక లెజెండ్ అనీ.. ఆయనతో నటించడం తన అదృష్టమని ఒక టీవీ ఇంటర్వూలో చెప్పారు ధనుష్. నాగ్ నటించిన ‘రక్షకుడు’ (రచగన్) తనకెంతో ఇష్టమని.. ఇప్పటికీ ఆ సినిమా తన మదిలో మెదులుతుందని అన్నారు. అలాంటి నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా తనకు దక్కిన గౌరవమని చెప్పారు.
‘‘నాగార్జున గారి సినిమాలు ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తించుకుంటారు. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్. ముఖ్యంగా రచగన్ సినిమాలో ఆయన నటన ఇంకా నా మనసులో అలాగే ఉండిపోయింది’’ అని ఈ సందర్భంగా చెప్పారు.
►ALSO READ | Khaleja4KFromMay30: అప్పుడేమో డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్బస్టర్.. రీ-రిలీజ్ టికెట్ సేల్స్లో ఖలేజా ట్రెండ్సెట్టర్ !
నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు ధనుష్. సెట్స్ లో దగ్గరుండి ఆయన నటన, వర్కింగ్ స్టైల్ చూసీ చాలా నేర్చుకున్నానని అన్నారు. ఆయన సొంతంగా తన పనులు తాను చేసుకోవడం చాలా గొప్పగా అనిపించిందని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని.. తప్పకుండా ఫాలో అవ్వటానికి ట్రై చేస్తానని ఈ సందర్భంగా ధనుష్ చెప్పారు.
కింగ్ నాగార్జున ఇప్పటికే తమిళ హీరో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో నాగ్ పోషించిన కీలక పాత్రను చాలా మంది మెచ్చుకున్నారు. ఇమేజ్ అనే చట్రం నుంచి బయటకు వచ్చి మల్టీ స్టారర్.. అది కూడా కీలక పాత్రలో నటించడంపై అభినందించారు. ఇప్పుడు అలాంటిదే కథ డిమాండ్ కు తగిన పాత్రలో నాగ్ ఒదిగిపోవడం విశేషం. జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.