
దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి డైరెక్షన్లో అశ్వినీదత్ నిర్మించిన ‘సీతారామం’ ఇటీవల విడుదలై మంచి కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న టీమ్ నిన్న ప్రెస్మీట్ నిర్వహించింది. అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసి జెలస్ ఫీలయ్యాను. దుల్కర్ పాత్ర చూస్తే పాత రోజులు గుర్తొచ్చాయి. నేను గీతాంజలి, సంతోషం, మన్మథుడు లాంటి రొమాంటిక్ మూవీస్ చేశాను. రొమాన్స్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఉందీ సినిమా. ఇదొక క్లాసిక్. క్యారెక్టర్స్ పరంగా హను ఇచ్చిన డిటెయిలింగ్ బాగుంది. మృణాళ్ చేసిన సీత పాత్రతో ప్రేమలో పడిపోయాను. సినిమా బాగా తీస్తే చూస్తామని మరోసారి నిరూపించిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం’ అన్నారు. దుల్కర్ మాట్లాడుతూ ‘అన్ని భాషల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎనిమిది, తొమ్మిది సార్లు చూశామంటున్నారు డైరెక్టర్ హను జీనియస్.
వైజయంతి బ్యానర్లో వర్క్ చేయడం హ్యాపీ’ అన్నాడు. ఐకానిక్ క్యారెక్టర్లో చూపించిన దర్శకుడికి, సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పింది మృణాళ్. ‘ఈ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. ఇది నాకు బాగా దగ్గరైన కథ. దీని వెనుక చాలామంది కష్టం ఉంది. వారందరికీ పేరుపేరునా థ్యాంక్స్’ అన్నాడు హను. అశ్వినీదత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూస్తే మా బ్యానర్లో అత్యధిక సినిమాలు చేసిన నాగార్జున గారే గుర్తొచ్చారు. అలాగే శ్రీదేవి, జయప్రద గుర్తొచ్చినప్పుడు ఇకపై మృణాళ్ కూడా కనబడుతుంది. సక్సెస్కి ఎంతో దూరంలో ఉన్న మాకు ‘మహానటి’ తో మొదటి విజయాన్ని, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ని అందించి దుల్కర్ మా సొంత హీరో అయిపోయాడు. అతి త్వరలోనే సీక్వెల్ అనౌన్స్ చేస్తాం’ అన్నారు. స్వప్నాదత్, ప్రియాంక దత్, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, సునీల్ నారంగ్ సహా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.