లక్నవరం బ్రిడ్జిపై ఐ ఓట్‌‌‌‌ ఫర్‌‌‌‌ ష్యూర్‌‌‌‌

లక్నవరం బ్రిడ్జిపై ఐ ఓట్‌‌‌‌ ఫర్‌‌‌‌ ష్యూర్‌‌‌‌

ములుగు, వెలుగు :   ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని  లక్నవరం సరస్సు తీగెల వంతెనపై  మంగళవారం ‘‘ఐ వోట్ ఫర్​ ష్యూర్​’’  లోగోను స్టూడెంట్లు ప్రదర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి  ‘సిస్టమాటిక్​ ఓటర్స్​ ఎడ్యుకేషన్​ అండ్​ ఎలక్టోరల్​ పార్టిసిపేషన్’​ (స్వీప్​) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  అదేవిధంగా సరస్సులో నీటిలో తేలియాడే విధంగా ‘ఎస్​వీఈఈపీ’ లోగోను కూడా ప్రదర్శించారు. 

 డ్రోన్​ కెమెరా ద్వారా ఫొటోలు తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 18ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.సత్యపాల్​ రెడ్డి, జడ్పీ సీఈవో ప్రసూన రాణి, డీడబ్ల్యూవో ప్రేమలత, డీఎంహెచ్​వో అల్లెం అప్పయ్య, డీసీవో సర్ధార్​ సింగ్​, డీసీఎస్​వో అరవింద్​ రెడ్డి, సీపీవో ప్రకాశ్​, డీఏవో గౌస్​ హైదర్​ తదితరులు పాల్గొన్నారు.