సుఖోయ్ జెట్స్తో గగనతలంపై పహారా

సుఖోయ్ జెట్స్తో గగనతలంపై పహారా

జీ–20 సమిట్​కు ఢిల్లీ సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్​కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ఈ సమిట్ జరగనుంది. 

జీ20 సమిట్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ఢిల్లీ మొత్తాన్ని యుద్ధ విమానాలు పహారా కాస్తుంటాయి. హై టెక్నాలజీ డ్రోన్లను కూడా కేంద్రం రంగంలోకి దించింది. ఢిల్లీ గగనతలంపై రాఫెల్‌‌, మిరాజ్-2000, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరిస్తున్నది.