- పోలీస్ ట్రైనింగ్ ప్రారంభోత్సవంలో ఐబీ చీఫ్ శివధర్రెడ్డి
హైదరాబాద్,వెలుగు: పోలీస్ ఉద్యోగాల భర్తీలో ఎదురైన ఆటంకాలను రాష్ట్ర ప్రభుత్వం అధిగమించిందని ఇంటలిజెన్స్ చీఫ్ బి శివధర్రెడ్డి పేర్కొన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిందన్నారు. డ్యూటీలో ఎదురయ్యే సవాళ్లను ప్యాషన్ గా తీసుకుంటేనే వృత్తిలో రాణించగలుగుతారని సూచించారు.
అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం కానిస్టేబుల్ శిక్షణను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 15,644 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు. అన్ని ఉద్యోగాల కన్నా పోలీస్ జాబ్ ఎంతో ప్రత్యేకత కలిగిందన్నారు. ఈ సెంటర్లో వరంగల్ జిల్లా నుంచి 202, మహబూబాబాద్ -58, కామారెడ్డి-79,నిజామాబాద్ నుంచి142 మంది మొత్తం 481 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.