వండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు

వండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇబ్రహీం పట్నం పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  నిందితులపై  పొక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  

వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేందర్, అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మేస్త్రీ పనులు చేస్తూ  ధర్మేందర్ జీవనం సాగిస్తున్నాడు. ఇబ్రహీం పట్నం పెద్ద చెరువు సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని మరో ఉంటున్నాడు. వారం రోజు క్రితం మైనర్ బాలికను రూం పిలిపించుకొని అక్కడే సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 5న ధర్మేందర్ తన స్నేహితులు చందన్ కుమార్, మల్లు, శంభులు, చందన్ కుమార్ కలిసి రూంలో పార్టీ చేసుకున్నారు. వారికి మైనర్ బాలిక వంట చేయగా అక్కడే తిన్నారు.  

అర్థరాత్రి దాటాక ధర్మేందర్ స్నేహితులు నలుగురు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ధర్మేందర్ ను బయటకి నెట్టి బాలికపై అఘాయిత్యం చేశారు. 100 కాల్ చేసి పోలీసులకు ధర్మేందర్ సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. చందన్ కుమార్,మల్లు, శంభు, చందన్ కుమార్ లపై పొక్సో కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మైనర్ బాలికను సఖీ కేంద్రానికి తరలించినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.