ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

