టీ 20 వరల్డ్ కప్ మ్యాచులు నడుస్తున్నాయి.. ఫస్ట్ లీగ్ మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. నెదర్లాండ్ పై చచ్చీచెడీ గెలిచింది. వరల్డ్ కప్ లో ఇండియాపై ఆడేది లేదని స్పష్టం చేసిన పాక్ జట్టుతో.. ఐసీసీ కీలక చర్చలు నడుపుతుంది. పాక్ జట్టు తీరుపై గట్టిగా వార్నింగ్ ఇస్తున్న ఐసీసీ.. ఇప్పటికే నష్టపోయిన వందల కోట్ల రూపాయలను చెల్లిస్తారా లేదా అంటూ అల్టిమేటం ఇచ్చింది. ఐసీసీ మీటింగ్ లోనూ పాకిస్తాన్ వెనక్కి తగ్గటం లేదు. తన బలుపు, అహంకారం చూపిస్తూనే ఉంది. ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే 3 కండీషన్స్ పెట్టింది.. ఈ కండీషన్స్ పై ఐసీసీ కూడా గుర్రుగా ఉంది.
పాక్ పెట్టిన కండీషన్స్ ఇవే:
కండీషన్ 1 : ఐసీసీకి వచ్చే ఆదాయంలో పాకిస్తాన్ వాటా పెంచాలి.
కండీషన్ 2 : ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరించాలి
కండీషన్ 3 : మ్యాచ్ ప్రారంభం ముందు.. మ్యాచ్ తర్వాత.. రెండు జట్ల సభ్యులు షేక్ హ్యాండ్ ఇచ్చే సంప్రదాయం ఇండియా పాటించాలి.
ఐసీసీకి పాకిస్తాన్ జట్టు పెట్టిన కండీషన్స్ ఇవే.. ఈ 3 కండీషన్స్కు ఓకే అంటే.. టీ 20 వరల్డ్ కప్లో ఇండియాతో ఆడేందుకు సై అంటూ ఐసీసీకి స్పష్టం చేసింది పాకిస్తాన్.
పాక్ కండీషన్స్పై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇండియాతో లింక్ ఉంది కదా.. ఇండియా ఒకే అంటేనే.. పాకిస్తాన్ జట్టుకు క్లియరెన్స్ వస్తుంది. ఇండియాతో లింక్ పెడుతూ.. ఇండియాపై పై చేయి సాధించటానికి పాకిస్తాన్ కావాలనే ఇలాంటి కండీషన్స్ పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ బహిష్కరిస్తూ పాక్ తీసుకున్న నిర్ణయంపై పీసీబీతో ఐసీసీ చర్చలు జరిపింది.
ఐసీసీ ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్లి చర్చలు జరిపారు.
దాదాపు 5 గంటలు చర్చలు జరిగాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరోసారి ఆ దేశ ప్రభుత్వంతో చర్చించి 24 గంటల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
