న్యూఢిల్లీ: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ హర్యానా ప్రభుత్వానికి మొత్తం రూ.583 కోట్ల ప్రిన్సిపల్, వడ్డీని చెల్లించినట్లు ప్రకటించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అకౌంట్ల నుంచి రూ.590 కోట్లను బ్యాంక్ ఉద్యోగులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ మోసంపై విచారణ కొనసాగుతోందని బ్యాంక్ పేర్కొంది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రకారం, కొంతమంది ఉద్యోగులు బయట వ్యక్తులతో కలిసి నకిలీ పత్రాలు, చెల్లింపులను క్లియర్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ మోసపోయిన అమౌంట్ను రికవరీ చేయలేకపోతే బ్యాంక్ పన్ను ముందు లాభం మార్చి క్వార్టర్లో 56శాతం తగ్గొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
