వర్షాలకోసం దేవుళ్లకు జలాభిషేకం

వర్షాలకోసం దేవుళ్లకు జలాభిషేకం

మెట్ పల్లి, వెలుగు: వర్షాలు కురవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామాభివృద్ధి కమిటీ అధ్వర్యంలో దేవతామూర్తులకు శనివారం గోదావరి జలాలతో అభిషేకం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్వర్యంలో గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్ళతో ఊరేగింపు నిర్వహించి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో వీడీసిసీఅద్యక్షుడు తోగిటి అంజయ్య, మంచాల శివ, భూమేశ్, రాజారెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.