బీఆర్ఎస్ అధికారంలోకొస్తే ఐటీ రైడ్స్ ఉండవ్ : మల్లారెడ్డి

బీఆర్ఎస్ అధికారంలోకొస్తే ఐటీ రైడ్స్ ఉండవ్ : మల్లారెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఐటీ రైడ్స్ ఉండవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రతీ ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. సంపాదించుకున్న వాళ్లు సొంతంగా ట్యాక్స్ చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ రూల్స్ తెస్తారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ బహిలంపూర్లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. 

సీఎం కేసీఆర్ తన వెంట ఉన్నంత వరకు ఏ రైడ్స్కూ భయపడనని మల్లారెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మార్పు కోసం దేశ ప్రజలు, మేధావులు ఆలోచన చేస్తున్నారని.. 2024లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశానికెళ్లిన మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులుంటారని తెలిపారు.