గెలిపిస్తే ఖైరతాబాద్​ను అభివృద్ధి చేసి చూపిస్త : చింతల రామచంద్రారెడ్డి

గెలిపిస్తే ఖైరతాబాద్​ను అభివృద్ధి చేసి చూపిస్త : చింతల రామచంద్రారెడ్డి

ఖైరతాబాద్, వెలుగు : అన్ని వేళలా తాను జనాలకు అందుబాటులో ఉంటున్నానని ఖైరతాబాద్ సెగ్మెంట్ బీజేపీ క్యాండిడేట్ చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన బంజారాహిల్స్​లోని ఎన్​బీటీనగర్​లో ఇంటింటికి వెళ్లి జనాలను కలిశారు. తనకు ఓటు వేయాలని కోరారు. డిసెంబర్​3న జరిగే ఎన్నికల్లో తననుగెలిపించాలన్నారు.

ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. తనను గెలిపిస్తే ఖైరతాబాద్ సెగ్మెంట్​ను అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. చింతల వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.