పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా

పీసీసీ ఇవ్వండి.. ప్రగతి భవన్ పునాదులు కదిలిస్తా

తనకు సీఎం, మంత్రి పదవులు అవసరం లేదని… తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే చాలన్నారు అన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. PCC పగ్గాలను తనకిస్తే… రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పీసీసీ ఇవ్వాలని గతంలో కూడా అడిగానని… కానీ తనకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఈసారైనా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ని అడిగానని చెప్పారు. PCC పదవిని ఇవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపడతానని… ఎన్నికలకు ఏడాది ముందు నుంచి హైదరాబాదులో ఉంటానని అన్నారు. ఊరూరా తిరిగి ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. అంతేకాదు ప్రజలతో కలిసి ప్రగతి భవన్ పునాదులను కదిలిస్తానని చెప్పారు.

తనపై భూకబ్జా కేసులు కానీ, ఇతర కేసులు కానీ లేవని… అలాంటప్పుడు PCC తనకు ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకన్నారు కోమటిరెడ్డి. తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన చరిత్ర తనదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్  పరిస్థితి చివరి స్టేజ్ లో ఉందని… తనకు PCC ఇస్తే పునర్వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.