
వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ హీరోయిన్. సి.హెచ్. క్రాంతి కిరణ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్కి రెడీ అవుతోన్న ఈ మూవీ టీజర్ను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘టీజర్ చూస్తుంటే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా గుర్తొస్తుంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా ఉండదు. కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. యంగ్ టీమ్తో తీసిన మూవీ సక్సెస్ సాధించాలని కోరుతున్నా’ అన్నారు.
వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘సినిమా మీద ప్యాషన్ తో నటుడు అవ్వాలనే మా అమ్మ కోరికతో ఇండస్ట్రీ కి వచ్చాను. ఇది నా పదిహేనేళ్ల కల. ఇప్పుడు నెరవేరింది. అందర్నీ ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’ అన్నాడు. మంచి కథతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత. నాగ్ అశ్విన్ తల్లి డాక్టర్ జయంతి రెడ్డి, గాయత్రి పటేల్, లోహిత్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ కార్యక్రమంలో పాల్గొన్నారు.