చేవెళ్ల, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థల్ని బీజేపీ ప్రైవేటు పరం చేస్తుందిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్, మొయినాబాద్ మండలం అప్పాజీగూడ, చిలుకూరు, ఎన్కపల్లి, వెంకటపూర్, కాశీంబౌలి, అందపూర్, శ్రీరామ్ నగర్, హిమయత్ నగర్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో మూడు కొట్లాటలు.. ఆరు కేసులతో నాయకుల తీరు ఉండేదన్నారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే బీజేపీ, కాంగ్రెస్లను నమ్మొద్దన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.