- వారం రోజుల్లో 7 బైకులు చోరీ
తిరుపతి: వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. పార్కు చేస్తే చాలు గంటలోనే చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఏడు బైకులు చోరీ చేశారంటే దొంగల వ్యవహార శైలి ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా పార్కు చేసిన గంట వ్యవధిలోనే ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ద్విచక్ర వాహనాలు వరుస చోరీలకు గురవుతుండడం స్థానికంగా సంచలనం రేపింది. తిరుపతి రూరల్ పరిధిలో ని పుదిపట్ల పంచాయితీ లో గంటలోపే రెండు బుల్లెట్ వాహనాలు చోరీకి గురయ్యాయి. ఇద్దరు దొంగలు కాలనీకి వచ్చి అటూ… ఇటూ గమనిస్తూ.. బైకులను తోసుకుంటూ తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా ఎం. ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. గతంలో విద్యానగర్ లో రెండు,పాత కాల్వ మూడు బుల్లెట్ వాహనాలు చోరీ చేసింది కూడా వీరే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఏడు బైకులు చోరీకి గురి కావడం కలకలం రేపుతోంది. పాత నేరస్తులతోపాటు.. కొత్త ముఠాలు ఏమైనా వచ్చాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజీ దొరకడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి
స్కూలుకెళ్లి చదువుకోమన్నందుకు 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్-బెంగళూరు టీఎస్ఆర్టీసీ బస్సుల తనిఖీ.. 16.5 కిలోల గంజాయి పట్టివేత
ఇంగ్లండ్పై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్