ఇవాళ్టి ( ఫిబ్రవరి 17 ) నుంచి ఐఐఎఫ్ఎల్ పబ్లిక్ బాండ్స్ ఇష్యూ

ఇవాళ్టి ( ఫిబ్రవరి 17 ) నుంచి ఐఐఎఫ్ఎల్ పబ్లిక్ బాండ్స్ ఇష్యూ

హైదరాబాద్​, వెలుగు: నాన్ బ్యాంకింగ్‌‌​ ఫైనాన్స్​ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ.రెండు వేల కోట్లు సమీకరించేందుకు మంగళవారం నుంచి పబ్లిక్ ​బాండ్ల జారీని ప్రారంభించనుంది. 

వీటితో ఏడాదికి 9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. పెట్టుబడిదారులు 24, 36, 60 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. వీటిని బీఎస్​ఈ, ఎన్ఎస్​ఈల్లో లిస్ట్ చేస్తారు. కనీస పెట్టుబడి రూ.10 వేలుగా నిర్ణయించారు. 

2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ లో కంపెనీ రూ.501.3 కోట్లు నికరలాభం సాధించింది. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వాడతారు.