జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా ఇలంబర్తి

జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా ఇలంబర్తి
  • ఆమ్రపాలిని రిలీవ్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఆమె స్థానంలో ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు  
  • 16 నెలల్లో ముగ్గురు కమిషనర్ల మార్పు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏపీ కేడర్​కు చెందిన జీహెచ్ఎంసీ కమిషనర్​ఆమ్రపాలిని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్​చేసింది. ఆమె స్థానంలో ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, గ్రేటర్ హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​కు గడిచిన 16 నెలల్లో ముగ్గురు కమిషనర్లు మారారు. గతేడాదిలో జీహెచ్ఎంసీ కమిషనర్​గా వచ్చిన లోకేశ్​కుమార్​ను అదే ఏడాది జులై 3న బదిలీ చేశారు. ఆయన స్థానంలో రోనాల్డ్ రాస్​ను నియమించారు. 

ఈ ఏడాది జూన్ 27న రోనాల్డ్ రాస్​ను బదిలీ చేసి, ఆమ్రపాలికి గ్రేటర్​సిటీ బాధ్యతలు అప్పగించారు. ఏపీ కేడర్ కు చెందిన ఆమెను తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేయడంతో, ఆమె స్థానంలో ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఇలంబర్తికి ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.