పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు రిమాండ్

పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు రిమాండ్

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ వీక్లీ బజార్​లో ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్​ చేసి సోమవారం రిమాండ్​కు పంపినట్లు ఎస్​హెచ్​వో సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న అర్ధరాత్రి టాటా మ్యాజిక్ వాహనంలో 7.6 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం తరలిస్తుండగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు. 

ఆర్మూర్​కు చెందిన పద్మ రంజిత్ కుమార్, వేల్పూర్​కు చెందిన రేషన్​ డీలర్ మేకల పాపన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ కు పంపారని తెలిపారు. 

ఎడపల్లి :  పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని సోమవారం ఎడపల్లి పోలీసులు, ఎన్​ ఫోర్స్​మెంట్ అధికారులు ఎడపల్లి శివారులో పట్టుకున్నారు. బియ్యంతో పాటు వాహన డ్రైవర్​ ను అదుపులోకి తీసుకున్నారు.  దాదాపు 20 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమ తెలిపారు.