చీపురు పట్టి ఊడ్చిన మేయర్

చీపురు పట్టి ఊడ్చిన మేయర్

నిజామాబాద్​, వెలుగు:  ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం నిజామాబాద్​ నగరంలో 2కే రన్​ జరిగింది. ప్రోగ్రామ్​కు ప్రచారం కల్పించడంతో పాటు ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసేందుకు కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కంఠేశ్వర్​ బైపాస్​ రోడ్​ నుంచి ఓల్డ్​ ఆర్డీవో ఆఫీస్​దాకా కొనసాగిన రన్​ను అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, మేయర్​ ఉమారాణి జెండాఊపి ప్రారంభించారు.

నగరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్​ కార్పొరేషన్​ ఆఫీస్​లో మొదలుపెట్టిన కార్యక్రమంలో శానిటేషన్​ కార్మికులతో కలిసి మేయర్​ చీపురుపట్టి ఊడ్చారు. నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్, డిప్యూటీ కమిషనర్​ రవిబాబు, తహసీల్దార్​ విజయ్​కాంత్​రావు ఉన్నారు.