అక్రమ రేషన్ బియ్యం పట్టివేత 

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత 

డిండి, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని చెరుకుపల్లి గేట్​ వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం...    ట్రాలీ వెహికల్​లో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఉదయం

తరలిస్తుండగా పక్కా సమాచారంతో మండల పరిధిలోని చెరుకుపల్లి గేటు వద్ద పట్టుకున్నారు. అనంతరం   డ్రైవర్ రమేశ్​, ఓనర్ రాత్లావత్ బిచ్చాలు పై కేసు నమోదు చేసి, వాహనాన్ని  సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.