మహిళతో ఇమ్రాన్​ ఖాన్​ ఆడియో వైరల్.. ఫేక్ అంటున్న ఆ పార్టీ నేతలు

మహిళతో ఇమ్రాన్​ ఖాన్​ ఆడియో వైరల్.. ఫేక్ అంటున్న ఆ పార్టీ నేతలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన ఒక వార్త మరోసారి వైరల్ గా మారింది. ఓ మ‌హిళ‌తో ఇమ్రాన్  సంభాషించినట్టుగా రిలీజ్ అయిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. దీన్ని పాకిస్థాన్‌కి చెందిన సయ్యద్ అలీ హైదర్ అనే జర్నలిస్ట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది పాకిస్థాన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

ఈ ఆడియో క్లిప్స్ లో ఓ మహిళతో ఇమ్రాన్ అసభ్యంగా మాట్లాడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్ల్, వీడియోలు అన్నీ ఫేక్ అని.. ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. అసలు ఈ ఆడియోలో మాట్లాడింది ఇమ్రానా ? కాదా ? అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.