తల్లీ కూతుళ్ల హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

తల్లీ కూతుళ్ల హత్య కేసులో దోషికి ఉరిశిక్ష

నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కూతుళ్ల హత్యకేసులో 8వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ఇంతియాజ్‌కు ఇవాళ(గురువారం,ఫిబ్రవరి-6) ఉరిశిక్ష ఖరారు చేసింది. 2013లో నెల్లూరులోని హరనాథపురం రెండో వీధిలో నివాసముంటున్న దినకర్ రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవిలను నిందితుడు ఇంతియాజ్ మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి హత్య చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నగదు కోసమే నిందితులు ఈ ఘోరానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. 2013 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు విచారణ కొనసాగింది. లేటెస్ట్ గా సెషన్స్ కోర్టు ఇంతియాజ్ కు ఉరిశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పునిచ్చింది.