టాప్ 20లో నలుగురికి చోటు
టాప్ 20లో నలుగురికి చోటు
రాష్ట్రం నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు 22వేల మంది
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ (సెప్టెంబర్)లో వంద పర్సంటైల్తో పాటు టాప్ర్యాంకుల్లోనూ తెలంగాణ స్టూడెంట్లు హవా కొనసాగించారు. ఆలిండియా టాప్ టెన్ర్యాంకుల్లో 7,8 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన శశాంక్ అనిరుధ్ జాతీయస్థాయి ఓపెన్ కేటగిరిలో 7వ ర్యాంక్ సాధించి, తెలంగాణ టాపర్గా నిలిచాడు. ఓపెన్ కేటగిరిలో 8వ ర్యాంకు సాధించిన సాగి శివకృష్ణ రెండోస్థానంలో నిలిచాడు. ఆలిండియా టాప్ 20 లో నలుగురు చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్జనవరి, సెప్టెంబర్లో జరిగిన రెండు ఎగ్జామ్స్కు11.74 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, 10.23 లక్షల మంది హాజరయ్యారు. జనవరి, సెప్టెంబర్ లో జరిగిన రెండు పరీక్షలు 4.81 లక్షల మందిరాశారు. తెలంగాణ నుంచి జేఈఈ మెయిన్(సెప్టెంబర్) పరీక్షకు 67,319 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నెల 27న జేఈఈ అడ్వాన్స్డ్ఎగ్జామ్ జరగనుంది. జేఈఈ మెయిన్ లో వచ్చిన మార్కుల ఆధారంగా 2.5 లక్షల మందికి అడ్వాన్స్ డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. దీనికి ఓసీ కేటగిరిలో 90.3765 పర్సంటైల్, ఈడబ్ల్యూఎస్కోటాలో 70.2435, ఓబీసీ 72.8887, ఎస్సీ 50.1760, ఎస్టీ 39.0696, పీడబ్ల్యూడీ కోటాలో 0.0618 పర్సంటైల్ ను కటాఫ్గా పెట్టారు. ఈ మన రాష్ట్రం నుంచి జేఈఈ అడ్వాన్స్డ్రాసేందుకు 20 వేల నుంచి 22 వేల మంది వరకూ సెలక్ట్ కావచ్చని చెప్తున్నారు. టాపర్లంతా ఐఐటీల్లో సీట్లే లక్ష్యంగా అడ్వాన్స్ డ్ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నట్టు పేర్కొంటున్నారు.