ఫస్ట్ క్లాస్లో పాసైన అవిభక్త కవలలు

ఫస్ట్ క్లాస్లో పాసైన అవిభక్త కవలలు

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ –వాణిలు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. వీణ 712 మార్కులు సాధించగా... వాణి 707 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా  రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  వారిని అభినందించారు. వీణ –వాణి లు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. భవిష్యత్తులో వారికి అవసరమై అన్నిసదుపాయాలు అందిస్తామని తెలిపారు. వీణ –వాణి లకు సహకారం అందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.