కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలింది. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, కాళ్లకు మెట్టెలు, పట్టగొలుసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
నల్ల బ్లౌజ్, ముదురు నీలం చీర ధరించి ఉందన్నారు. డెడ్బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారం క్రితం మృతిచెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యనా, హత్యనా అనేది పోస్టుమార్టం రిపోర్టు తర్వాత తేలుస్తామని పోలీసులు అన్నారు.
