కొత్త సెక్రెటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా

కొత్త సెక్రెటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా

రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సెక్రెటేరియట్ను మొదట సీఎం కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులనూ ఆహ్వానించారు. ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు.