తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల తిరుపతి దేవస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి  ఏడు కొండల ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించింది. రంగనాయకుల మండపం, కల్యాణ వేదిక, ఆలయ ప్రాంగణం, మాడ వీధులను విద్యుత్ దీపాలతో అలంకరించింది. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామివారు పెద్ద శేషవాహనంపై  భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మాడ వీధుల్లో ఊరేగింపులు ఉండబోవని, టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. భక్తులు లేకుండా స్వామివారి రథం కదలబోదు కాబట్టి, రథోత్సవాన్ని పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపింది. బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి ఆహ్వానాన్ని అందించారు. దీనిపై స్పందించిన జగన్… గరుడోత్సవం రోజు తిరుమలకు వెళ్లాలని నిర్ణయించారు.

కరోనా వైరస్ కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండా ఏకాంతంగా జరగడం.. ఆలయ చరిత్రలో ఇదే మొదటి సారి అంటున్నారు ఆలయాధికారులు.