డ్రంకెన్ ​డ్రైవ్ టెస్ట్​ తప్పించుకోబోయి.. బస్సు కింద పడి యువకుడు మృతి

డ్రంకెన్ ​డ్రైవ్ టెస్ట్​ తప్పించుకోబోయి.. బస్సు కింద పడి యువకుడు మృతి
  • బైక్​ వెనక్కి తీస్తుండగా 
  • అడ్డుకున్న పోలీసులు
  • ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి
  • కరీంనగర్​ లో ఘటన

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్​ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా చూసిన ఓ యువకుడు..తప్పించుకోబోయి బైక్​తో సహా ఆర్టీసీ బస్సును ఢీకొట్టి చనిపోయాడు. స్థానికులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఎలబాక శ్రీనివాస్ (33) కరీంనగర్ లోని విద్యానగర్ లో ఉంటూ వెల్డింగ్​ పని చేసుకుంటున్నాడు. శుక్రవారం తన అన్న కూతురి పుట్టిన రోజు ఉండడంతో బుధవారం రాత్రి బైక్​పై గ్రామానికి బయలుదేరాడు.

ఇదే టైంలో నగరంలోని ఎన్టీఆర్ విగ్రహ సమీపంలో పోలీసులు డ్రంకెన్ ​డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. పోలీసులను చూసిన శ్రీనివాస్​ భయపడి బైక్‌‌ను వెనక్కి తిప్పబోయాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా అయోమయానికి గురై  ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద పడి స్పాట్‌‌లోనే చనిపోయాడు. డ్రంకెన్​ డ్రైవ్ ​టెస్ట్​సందర్భంగా పోలీసుల తీరు వల్లే  శ్రీనివాస్​చనిపోయాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన చేశారు.