వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి

 వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి

రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి 44వ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. వంటేరు ప్రతాప్ రెడ్డి కారు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ప్రతాప్ రెడ్డి కారులోనే ఉన్నారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింహులుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆయనను మరో కారులో అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం.