IND vs ENG: హిట్‌మ్యాన్ గ్రాండ్ ఎంట్రీ: హెలికాప్టర్‌లో ధర్మశాల చేరుకున్న రోహిత్ శర్మ

IND vs ENG: హిట్‌మ్యాన్ గ్రాండ్ ఎంట్రీ: హెలికాప్టర్‌లో ధర్మశాల చేరుకున్న రోహిత్ శర్మ

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ముందస్తు వివాహ వేడుకలకు బడా బడా వ్యాపారవేత్తలు, టాప్‌ క్రికెటర్లు, ప్రపంచ కుబేరులు అంతా కదిలి వెళ్లారు. ఈ ప్రీ వెడ్డింగ్ బాష్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ- రితికా సజ్దేహ్‌ దంపతులు కూడా హాజరయ్యాడు. వేడుకల అనంతరం హిట్‌మ్యాన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ధర్మశాల చేరుకున్నాడు. 

మార్చి 07, నుంచి 11 వరకూ ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5వ టెస్టు ప్రారంభంకానుంది. దీంతో జట్టుతో కలవడానికి రోహిత్ శర్మ ప్రత్యేక హెలికాప్టర్‌లో ధర్మశాల చేరుకున్నాడు. విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడంతో హిట్‌మ్యాన్ కోసం ప్రత్యేక  ఛాపర్ వినియోగించారని వినికిడి. వాతావరణ సూచనల ప్రకారం.. ప్రస్తుతం ధర్మశాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్క వగా ఉన్నాయి. ఒక డిగ్రీక కూడా పడిపోవచ్చని నివేదికలు సూచించాయి. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ ప్రత్యేక  ఛాపర్ లో ధర్మశాల స్టేడియంకు చేరుకున్నాడు. సెక్యూరిటీ అధికారులు నడుమ భారత కెప్టెన్  హెలికాప్టర్ నుంచి దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పరువు కోసం ఇంగ్లాండ్

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలివుండగానే భారత జట్టు 3-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్.. 5వ టెస్టులో గెలిచి  పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ALSO READ :- Fact Check : ఏపీ సెక్రటేరియట్ నిజంగా తాకట్టు పెట్టారా.. నిజమేంటీ..!