IND vs SA 3rd T20I: మరోసారి సఫారీలదే టాస్.. భారత జట్టులో మార్పుల్లేవ్

IND vs SA 3rd T20I: మరోసారి సఫారీలదే టాస్.. భారత జట్టులో మార్పుల్లేవ్

టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టీ20లో సఫారీ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో చేజింగ్ ఎంచుకొని విజయం సాధించడంతో మరోసారి ఫీల్డింగ్ వైపే ముగ్గు చూపాడు. 

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా, టీమిండియా గత జట్టునే కొనసాగించింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పక విజయం సాధించాలి. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో తొలి టీ 20 వర్షం కారణంగా రద్దవ్వగా, రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలుపొందింది.

తుది జట్లు

టీమిండియా: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, లిజాద్ విలియమ్స్, తబ్రైజ్ షమ్సీ, నాండ్రే బర్గర్.