IND vs SL: శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్స్.. స్క్రీన్ పై చాహల్ భార్య!

IND vs SL: శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్స్.. స్క్రీన్ పై చాహల్ భార్య!

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఏ ఒక్కరూ సెంచరీ చేయకపోయినా.. లంకేయుల ముందు 358 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. శుభ్‌మన్‌ గిల్‌ ( 92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (88; 94 బంతుల్లో 11 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.

ఇదిలావుంటే ఈ మ్యాచ్ ముంబై, వాంఖడే వేదికగా  జరుగుతుండడంతో క్రికెటర్ల సతీమణులు, వారి వారి కుటుంబసభ్యులు అందరూ హాజరయ్యారు. రోహిత్ భార్య రితికా సజ్దే, రాహుల్ భార్య అథియా శెట్టి, చాహల్ భార్య ధన శ్రీ వర్మ, సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ సహా పలువురు కనువిందు చేశారు. ఈ క్రమంలో కెమెరామెన్ చేసిన ఒక పని.. ఓ అపురూప దుశ్యానికి వేదికైంది. భారత ఇన్నింగ్స్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్స్ కొట్టగా.. స్క్రీన్‌పై చాహల్ భార్య ధన శ్రీ వర్మ  దర్శనమిచ్చింది. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది.

అసలే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ దృశ్యం నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది. కెమెరామెన్ కావాలనే స్క్రీన్ పై ధన శ్రీని చూపించారని కొందరు కామెంట్ చేస్తుండగా..  లేదు అయ్యర్ కావాలనే వారి కూర్చున్న వద్దకు కొట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ధన శ్రీ పక్కనే చాహల్ కూడా ఉండటం గమనార్హం. కాగా, కొందరు ఆకతాయిలు అయ్యర్-ధన శ్రీ మధ్య ఏదో జరుగుతున్నట్లు నెట్టింట పుకార్లు సృష్టిస్తున్నారు.

ALSO READ : ODI World Cup 2023: లంక బౌలర్లను చితక్కొట్టిన భారత్..టార్గెట్ ఎంతంటే..?