
స్వాతంత్ర్య దినోత్సవం 2023 సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను అవిష్కరించారు సీఎం కేసీఆర్ . పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ, సీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్ లోఅమరజవాన్ల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.