విజృంభిస్తోన్న కరోనా.. దేశంలో 4 వేలకు చేరిన కరోనా కేసులు

విజృంభిస్తోన్న కరోనా.. దేశంలో 4 వేలకు చేరిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 312 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 ,054కు చేరిందని  కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 128 కేసులు నమోదయ్యాయి.

దేశంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 4.5 కోట్లుగా నమోదైంది. వైరస్ బారిన పడ్డ వారిలో 4,44,71,860 కోట్ల మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 98.81 గా నమోదైంది.

భారత్ తో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో  డబ్ల్యూహెచ్ఓ  ఆందోళన చెందుతోంది. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది.  ఇప్పటికే సింగపూర్‌లో మాస్కులు తప్పనిసరి చేశారు.