టీమిండియా ఆల్ రౌండర్ భార్య పొలిటికల్ ఎంట్రీ

టీమిండియా ఆల్ రౌండర్ భార్య పొలిటికల్ ఎంట్రీ

భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆమె ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాన్ఛో ఫాల్దూ, జామ్ నగర్ లోక్ సభ సభ్యురాలు పూనమ్ మేడమ్ ఆమెకు కాషాయ కండువా కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. క్షత్రియ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కర్ణి సేనకు గుజరాత్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.