వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్ కోసం విండీస్ వెళ్లనుంది టీమిండియా. ఇప్పటికే వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇవాళ టీ20 జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, రవి విష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ ఉన్నారు.
కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే రాహుల్ అదేసమయంలో విరాట్ కోహ్లీ, బూమ్రలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. జూలై 22 నుంచి అగస్ట్ 7 వరకు ఈ సిరీస్ జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న భారత్ ఆ దేశ జట్టుతో మరో రెండు వన్డేలు ఆడాల్సివుంది.
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
— BCCI (@BCCI) July 14, 2022
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.