దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో  కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,881 కేసులు రావడంతో మొత్తం కేసులు 80 లక్షలు దాటాయి. ప్రస్తుతం 80,40,203 ఉన్నాయి. నిన్న మరో 517 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు దేశంలో 1,20,527 కు చేరాయి. నిన్న 56,480 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య73,15,989 కు చేరింది. ఇంకా 6,03,687 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక అక్టోబర్ 28 వరకు దేశంలో మొత్తం కరోనా టెస్టులు 10 కోట్ల 65 లక్షల 63 వేల 440 కి చేరాయి.