
భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. ఒక్కరోజే 11 వేల 458 కేసులు నమోదుకాగా..386 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 9 వేల 606కు పెరిగాయి. మరణాల సంఖ్య 8,890కి చేరింది. మొత్తం లక్షా 54 వేల 231 మంది కోలుకున్నారు. లక్షా 46 వేల 463 మంది ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 1,01,141కి చేరింది. మొత్తం 3,717 మంది చనిపోయారు.