
వెస్టిండీస్ తో జరుగుతున్న అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఓవర్ నైట్ స్కోర్ వద్దే 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్ లో 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా రెండో ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ తేడాతో ఓడించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెండో ఇన్నింగ్స్ లో అప్పుడే రెండు వికెట్లు కోల్పోయింది. టాగెనరైన్ చంద్రపాల్ (8) ను సిరాజ్ ఔట్ చేస్తే.. జాన్ కాంప్బెల్ (14)ను జడేజా పెవిలియన్ కు పంపాడు.
ప్రస్తుతం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజ్ లో అలిక్ అథనాజ్ (2), బ్రాండన్ కింగ్ (0) ఉన్నారు. ఇండియా బౌలర్లలో సిరాజ్, జడేజాలకు తలో వికెట్ లభించింది. రెండో రోజు (శుక్రవారం) ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి మూడో రోజు ఉదయాన్నే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురెల్ (210 బాల్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), రవీంద్ర జడేజా (176 బాల్స్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (197 బాల్స్లో 12 ఫోర్లతో 100) సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్తో తొలి టెస్టును ఇండియా పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది.
అంతకుముందు గురువారం టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 రన్స్కే కుప్పకూలింది. జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), కెప్టెన్ రోస్టన్ చేజ్ (24) మాత్రమే కాసేపు ప్రతిఘటించారు. ఇండియా బౌలర్లలో సిరాజ్ (4/40), బుమ్రా (3/42), కుల్దీప్ (2/25) విండీస్ నడ్డి విరిచారు. అనంతరం బ్యాటింగ్లోనూ దుమ్మురేపిన ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 286 రన్స్ ఆధిక్యం సంపాదించింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మూడు.. కుల్దీప్ యాదవ్ రెండు.. సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.