కష్టాల్లో టీంఇండియా

 కష్టాల్లో  టీంఇండియా

ఇంగ్లండ్ తో జరుగుతోన్న మూడో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది.. స్వల్పస్కోర్లకే ఓపెనర్లిద్దర్ని కోల్పోయింది.మూడో ఓవర్ తొలి బంతికే ధావన్ (1) పెవిలియన్ కు చేరగా, ఐదో ఓవర్లో రోహిత్ శర్మ (17) అవుటయ్యాడు.   ఆ తరువాత కోహ్లీ(17) పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో భారత్‌ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ప్రస్తుతం  క్రీజులో రిషబ్ పంత్‌ (2), సూర్యకుమార్‌ యాదవ్‌(4) పరుగులతో ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 46 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 259 రన్స్ చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4, చాహల్ 3 వికెట్లతో సత్తా చాటారు. సిరాజ్ 2 వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.